Saturday, May 4, 2024

WGL: విధులు గూడూరులో.. వైద్యం నర్సంపేటలో..

ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వర్తించాల్సిన వైద్యుడు విధులు మరిచి తన సొంత క్లినిక్ లో వైద్యం చేస్తున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు ఏరియా ఆసుపత్రిలో జరిగింది. గూడూరు ఏరియా ఆసుపత్రికి ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రేఖ రాజమ్మ అనే మహిళ వైద్యం కోసం రాగా.. వైద్యం అందించాల్సిన వైద్యులు ఎడ్ల రమేష్ అందుబాటులో లేడు. ఎక్కడికి వెళ్ళాడు అనేది అరా తీయగా.. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలో ఉన్న తన సొంత వైద్యశాలలో వైద్యం చేస్తూ ఉన్న పరిస్థితి.

వైద్యం అందించాల్సిన వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో క్షతగాత్రులు చేసేదేమీ లేక వేరే ఆసుపత్రికి తరలిన దుస్తితి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నమ్మకం కలిగేలా అనేక కార్యక్రమాలు చేస్తూ నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే నానుడిని మరిచే పరిస్తితి తేస్తే అందుబాటులో ఉండాల్సిన వైద్యులు మాత్రం తమ స్వంత క్లినిక్ లపై ఉన్న శ్రద్ధ విధులపై లేకపోవడం కారణంగా ప్రభుత్వ ఆసుపత్రులపై ఉన్న నమ్మకం నీరు గారే దుస్తితి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement