Friday, May 3, 2024

కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్ సరికొత్త రికార్డు

కరోనాపై పోరాటం సందర్భంగా దేశమంతటా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కరోనా వేరియంట్లను ఎదుర్కొనేందుకు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడంతో పాటు వ్యాక్సినేషన్ కూడా తప్పనిసరి. దీంతో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ప్రపంచంలోనే ఇంత పెద్ద సంఖ్యలో వ్యాక్సినేషన్ జరగడం మన దేశంలోని తొలిసారి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సినేషన్ లో ఇండియా సరికొత్త రికార్డును నెలకొల్పింది.

ఒక్కరోజులో కోటి 9 లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. ఐదురోజుల వ్యవధిలో ఇది రెండో సారని కేంద్రం వెల్లడించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా మొదటి డోసులు 50 కోట్ల మందికి పైగా వేసారు. అలాగే సెకండ్ డోసులు 14కోట్ల మందికి పైగా తీసుకున్నారు. వ్యాక్సినేషన్‌లో వేగం, ప్రజలందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి ఉండడంతో ఫలితాలు తొందరగా అందుతున్నాయని కేంద్రం వివరించింది.

ఈ వార్త కూడా చదవండి: దేశంపై కరోనా గ్రహణం.. ఒక్క రోజులో భారీగా పెరిగిన కేసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement