Friday, May 3, 2024

డబ్ల్యూటీసీ పాయింట్లలో 4వ స్థానానికి భారత్‌… 5వ స్థానంలో పాకిస్తాన్‌

వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో భారత్‌ స్థానం కాస్త మెరుగుపడింది. పాకిస్తాన్‌పై రెండో టెస్టులో శ్రీలంక విజయం సాధించడంతో 53.33 శాతం పాయింట్లతో ఆ జట్టు మళ్లి మూడోస్థానానికి చేరుకోగా పాకిస్తాన్‌ 51.85 శాతం పాయింట్లతో ఐదో స్థానానికి దిగజారింది. ఇక భారత్‌ 52.08 శాతం పాయింట్లతో 4వ స్థానానికి ఎగబాకింది.

మొదటి రెండు స్థానాలలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా కొనసాగుతున్నాయి. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గాలేలో జరిగిన రెండో టెస్ట్‌ లో పాకిస్తాన్‌పై 246 పరుగుల భారీ ఆధిక్యంతో శ్రీలంక విజయం సాధించిన విషయం తెలిసిందే. శ్రీలంక స్పిన్నర్‌ ప్రభాత్‌ జయసూరియ 5 వికెట్లు పడగొట్టి విజయం దక్కేలా చేశాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement