Tuesday, April 30, 2024

Ind vs Eng, 5th Test : టీ బ్రేక్.. భారత్ స్కోరు 376/3

ధ‌ర్మ‌శాల‌లో భార‌త్ వ‌ర్సెస్ ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ లో రెండో రోజు ఆట కొనసాగుతోంది. అయితే రెండో రోజు టీ బ్రేక్ సమయానికి భారత్ జట్టు 84ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 376 పరుగులు చేసింది.

టీ బ్రేక్ సమయానికి భారత్ జట్టు బ్యాట్స్ మెన్లు సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 55 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్ తో 50 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు. అలాగే దేవదత్ పడిక్కల్ 44 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు. దీంతో ఇండియా జట్టు 158 పరుగుల లీడ్ లో ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement