Thursday, May 2, 2024

పెరిగిన క‌రోనా కేసులు… కొత్త‌గా 16,678 మందికి పాజిటివ్‌

దేశంలో కొత్తగా 16,678 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,36,39,329కి చేరాయి. ఇందులో 4,29,83,162 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,428 మంది మరణించారు. పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో యాక్టివ్‌ కేసులు 1,30,713కు పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 26 మంది వైరస్‌కు బలవగా, 14,629 మంది డిశ్చార్జీ అయ్యారు. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 5.99 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో 0.30 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.50 శాతం, మరణాలు 1.20 శాతంగా ఉన్నాయని వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 198.88 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement