Wednesday, May 15, 2024

తెలంగాణలో సైనిక్ స్కూళ్ల సంఖ్య పెంచండి : బండి సంజ‌య్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణాలో మరిన్ని సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ చేసిన సూచనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. శుక్రవారం ఆయన కేంద్ర జల వనరుల విభాగం సలహాదారు వెదిరె శ్రీరాంతో కలిసి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణలో సైనిక్ స్కూళ్ల ఏర్పాటు, రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలు, ప్రజా సంగ్రామ యాత్ర వివరాలను రాజ్‌నాథ్ అడిగి తెలుసుకున్నారు. టీఆర్ఎస్ అవినీతి, కేసీఆర్ కుటుంబ, నియంత పాలనకు వ్యతిరేకంగా చేపట్టిన తొలిదశ ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతమైందని, ఈనెల 14 నుంచి రెండో విడత యాత్రను చేపడుతున్నట్లు బండి సంజయ్ కేంద్రమంత్రికి వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement