Thursday, May 9, 2024

నేపాల్ లో.. ఆదిపురుష్ రిలీజ్ కి అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

నేడు ఆది పురుష్ మూవీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే నేపాల్ లో ఈ సినిమా విడుదలకు అనుమతిని నిరాకరించారు. ఈ చిత్రంలో సీత జన్మస్థలాన్ని తప్పుగా చూపించారని నేపాల్ సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. తప్పును సరిదిద్దుకోకపోతే నేపాల్ రాజధానిలో ఏ హిందీ సినిమాను అనుమతించబోమని ఖాట్మండూ మేయర్ హెచ్చరించారు. ఈ సినిమాలో సీతాదేవి భారతదేశపు కుమార్తె అనే డైలాగ్ చెప్పేలా సన్నివేశం ఉంది. అయితే, సీతాదేవి నేపాల్ లో జన్మించిందనేది ఆ దేశ ప్రజల నమ్మకం. ఇదే వివాదానికి కారణం అయింది. సీతాదేవి భారత్ లో పుట్టినట్టుగా ఉన్న డైలాగ్ ను తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే సినిమాను ప్రదర్శించనివ్వబోమని స్పష్టం చేశారు. ఈ చిత్రంలో రాముడి పాత్రను టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పోషించగా, సీతామాత పాత్రలో కృతి సనన్ నటించారు.మ‌రి చిత్ర బృందం ఏం చేయ‌నుందో తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement