Sunday, April 28, 2024

ఏపీ-తెలంగాణ భవన్‌లో ఇఫ్తార్ విందు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఇఫ్తార్ విందు జరిగింది. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రెండు భవన్‌లలో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులు, సిబ్బంది, సమీపంలోని ముస్లిం కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల తరఫున విందు ఏర్పాటు చేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్, అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా. గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు. ముస్లిం మతపెద్దలు, కమిషనర్లు భవన్ సిబ్బందికి ఆశీర్వాదాలు అందజేశారు. ఇఫ్తార్ విందులో భాగంగా పండ్లు, మాంసాహార భోజనాలు అందరికీ అందజేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement