Thursday, April 25, 2024

పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే అంతే.. భవిష్యత్తులో ఆ చాన్స్ ఉండదు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమీషన్‌ (టీఎస్‌పిఎస్‌సి) నిర్వహించిన నియామక పరీక్షల ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో కీలకంగా వ్యవహింరించిన 38 మందిని సిట్‌ (స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇలా అరెస్టయి కస్టడీలో ఉన్న అభ్యర్థులను టీఎస్‌పీఎస్సీ పరీక్షల నుంచి డీబార్‌ చేసింది. ఆయా అభ్యర్థులను ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో అనర్హులుగా ప్రకటించగా… భవిష్యత్తులోనూ వారిని పరీక్షలకు అనుమతించబోమని తేల్చింది. ఇలా 50మందిని పరీక్షల నుంచి డీబార్‌ చేస్తూ టీఎస్‌పీఎస్సీ ఉత్తర్వులు జారీ చేసింది. డీబార్‌ చేసిన అభ్యర్థులు తమకేమైనా అభ్యంతరాలుంటే రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement