Thursday, April 25, 2024

టీఎస్‌ ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు.. దశాబ్ది ఉత్సవాల కానుకగా మరో డిఏ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ ఆర్టీసీ) ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా, మరో విడత కరువు భత్యం (డీఏ) ఇవ్వాలని నిర్ణయించినట్లు సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండి విసి సజ్జన్నార్‌ వెల్లడించారు. జూన్‌ 2022లో ఇవ్వాల్సి ఉన్న 4.9 శాతం డిఏను మంజూరు చేస్తున్నామనీ, జూన్‌ నెల కనీస వేతనంతో కలిపి డిఏను ఉద్యోగులకు సంస్థ చెల్లిస్తుందని తెలిపారు.

తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగులు క్రియాశీల పాత్ర పోషించారనీ, 2011లో దాదాపు 29 రోజుల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొని ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా పెండింగ్‌లో ఉన్న ఏడో డిఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని యాజమాన్యం నిర్ణయించిందని వెల్లడించారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటి వరకు ఏడు డిఏలను సంస్థ మంజూరు చేసిందనీ, మిగిలిన ఒక్క డిఏను సైతం సంస్థ త్వరలోనే ప్రకటిస్తుందని ఈ సందర్భంగా గోవర్ధన్‌, సజ్జన్నార్‌ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement