Wednesday, May 15, 2024

Breaking | నన్ను దారుణంగా ట్రీట్​ చేశారు, నవీన్​రెడ్డితో పెళ్లి కాలేదు.. మీడియా ముందుకు వైశాలి

రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో నిన్న జరిగిన వైశాలి కిడ్నాప్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. నిన్న పట్టపగలు టీ ఓనర్ నవీన్ రెడ్డి ఏకంగా 100 మందితో యువతి ఇంటికొచ్చి నానా హంగామా చేశాడు. యువతి ఇంటి వద్ద ఉన్న కార్లను ధ్వంసం చేసి, అడ్డొచ్చిన యువతీ తల్లిదండ్రులు, బంధువులను కర్రలతో కొట్టారు. అనంతరం డెంటల్ డాక్టర్ వైశాలిని నవీన్ రెడ్డి కిడ్నాప్ చేశాడు. సినిమా రేంజ్ ను తలపించిన ఈ కిడ్నాప్ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనను చాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు 6 గంటల్లోనే యువతి ఆచూకీని కనిపెట్టారు.

కాగా, ఇవ్వాల (శనివారం) కిడ్నాప్​కు గురైన యువతి వైశాలి మీడియా ముందుకు వచ్చింది. తానను కిడ్నాప్​ చేసి తీవ్రంగా హింసించారని, దారుణంగా ట్రీట్​ చేశారని చెప్పుకొచ్చింది. అయితే తనకు నవీన్​రెడ్డితో పెళ్లి జరగలేదని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement