Tuesday, May 7, 2024

సామూహిక జాతీయ గీతాలాప‌న‌.. ఒక నిమిషం పాటు మెట్రో సేవ‌ల‌కు అంత‌రాయం!

75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వ‌హించ‌నుంది. దీనిలో భాగంగా రేపు (మంగళవారం) ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌ మెట్రో రైళ్లు కూడా కొద్దిసేపు ఆగిపోనున్నాయి. దీనికి సంబంధించిన అప్‌డేట్‌ని మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు. జాతీయగీతం ఆలపించడంతో నిమిషం పాటు మెట్రో సేవ‌లు నిలిచిపోతాయ‌ని ఆయ‌న తెలిపారు. అంతేకాకుండా ప్రయాణికులు నిలబడి సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొనాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement