Monday, April 29, 2024

Hyderabad – పెద్ద‌మ్మ త‌ల్లి ఆల‌యంలో చంద్ర‌ముఖి 2 టీమ్ ప్ర‌త్యేక పూజ‌లు

కంగ‌నా ర‌నౌత్, లారెన్స్ లు న‌టిస్తున్న మూవీ చంద్ర‌ముఖి … ఈ మూవీ ఈ నెల 28వ తేదిన విడుద‌ల కానుంది.. ఈ నేప‌థ్యంలో ‘చంద్రముఖి 2’ సినిమా టీమ్ నేడు హైద‌రాబాద్ లోని పెద్దమ్మతల్లిని దర్శించుకున్నారు. సినిమా విడుదలకి ముందుగా టీమ్ అమ్మవారి దర్శనం చేసుకుని, ఈ సినిమా పెద్ద విజయాన్ని సొంతం చేసుకోవాలంటూ అమ్మవారి ఆశీస్సులను అందుకున్నారు. దర్శకుడు పి.వాసు .. హీరో లారెన్స్ .. హీరోయిన్స్ కంగనా రనౌత్ – మహిమ నంబియార్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఈ సినిమాను గురించి ప్రస్తావించారు. ఆ సందర్భంగా అక్కడ అభిమానుల పెద్ద సంఖ్య‌లో చేరుకుని న‌టీన‌టుల ఆటోగ్రాఫ్ లు తీసుకున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement