Friday, May 17, 2024

Hyd: రాజ్ భవన్ వద్ద కాంగ్రెస్ శ్రేణులపై పోలీసుల లాఠీఛార్జ్

హైదరాబాద్ లోని రాజ్ భవన్ వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. రాజ్ భవన్ వైపు వేలాదిగా తరలివస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ కీలక నేతలైన మల్లు భట్టి విక్రమార్కతో పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, గీతారెడ్డి, అంజన్ కుమార్ లను అరెస్ట్ చేశారు. అలాగే రేణుకా చౌదరికి, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement