Friday, May 10, 2024

డబ్బు కోసం…వ్యభిచార కూపంలోకి భార్య భర్తలు

ప్రస్తుతం సమాజంలో చాలామంది ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. అయితే అందుకు కారణం కూడా లేకపోలేదు… కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులే అందుకు కారణం. వివరాల్లోకి వెళితే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఆర్థిక ఇబ్బందులను తొలగించుకునేందుకు వ్యభిచార ముఠా ప్రారంభించారు. చార్మినార్ ఫరూక్ నగర్ కు చెందిన ఆటోడ్రైవర్ ఎన్నో సంవత్సరాల క్రితం ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ కేసులో శిక్ష కూడా అనుభవించాడు. కానీ ఆ తరువాత బయటకు వచ్చి అత్యాచారానికి పాల్పడ్డ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇక జీవనోపాధి కోసం ఆటో నడిపేవాడు. కానీ ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. వ్యభిచార దందా నిర్వహించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే 15 రోజుల కిందట జల్ పల్లి పురపాలక షాహిన్ నగర్ బస్తీలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. అదే ఇంట్లో మరి కొంత మంది యువతులతో వ్యభిచారం స్టార్ట్ చేశారు.

విశేషం ఏంటంటే విషయం వెలుగులోకి రావటానికి ప్రధాన కారణం… ఆటో డ్రైవర్ కు అతని భార్య పై ఉన్న కోపమే. భార్యపై కక్ష తో ఉన్న ఆటోడ్రైవర్ ఆమె ఇంట్లో లేని సమయంలో మీడియాను పిలిచి తన భార్య వ్యభిచారం చేస్తుందని మీడియాకు చెప్పాడు. అనంతరం ఇంటికి వచ్చిన భార్య ఈ విషయం తెలుసుకొని భర్తతో గొడవకు జరిగింది. దీంతో మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇంటిపై దాడి చేశారు. ఇద్దరు యువతులు, అలాగే ఇద్దరు విటుల తో పాటు ఆ దంపతులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement