Monday, April 29, 2024

అడవిలోకి తీసుకువెళ్లి భార్యను హత్య చేసిన భర్త

భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అయ్యప్పస్వామి టెంపుల్ సమీపంలోని అడవిలో హత్య ఘటన చోటు చేసుకుంది. ఘణపురం మండలం వెంకటేశ్వర రావుపల్లి గ్రామానికి చెందిన బండారి ఓదేలు (58) తన భార్య లక్ష్మీ(55)ని మంగళవారం మహదేవపూర్ మండల సమీపంలోని అడవిలో హత్య చేశాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్నిపరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా భార్యను హత్య చేసిన భర్త పరారీలో ఉన్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement