Tuesday, April 23, 2024

బీజేపీకి ఎన్నికలు తప్ప.. కరోనా ఇబ్బందులు పట్టవా?

దేశంలో బీజేపీకి ఎన్నికలు తప్ప.. కరోనా ఇబ్బందులు పట్టడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా ఇబ్బందులు ఉన్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల రోడ్ షోలు రద్దు చేసుకున్నారని చెప్పారు. కరోనా విజృంభిస్తుంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉత్తరాఖండ్‌ లోని హరిద్వార్‌‌లో కుంభమేలా పెట్టాల్సిన అవసరం ఉందా ? అని వీహెచ్ ప్రశ్నించారు. కుంభమేళా పెట్టినందుకు ప్రధాని మోదీ, సీఎం తీరత్‌సింగ్ రావత్‌ పై చీఫ్ జస్టిస్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలకు అధికార అహం ఎక్కువైందని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రతి తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు 6 వేలు ఇవ్వాలని వీహెచ్ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement