Monday, April 29, 2024

National : హ‌ర్యానాలో న‌ర‌బ‌లి…

హర్యానాలోని అంబలాలో దారుణం జరిగింది. దేవత కలలో కనిపించి నరబలి కోరిందని చెబుతూ ఓ మహిళ యువకుడిని హత్య చేసింది. ప్రధాన నిందితురాలు ప్రియా ఇంట్లో మహేష్ గుప్తా(44) మృతదేహం నిన్న లభ్యమైంది. బాధితుడు మహిళ దుకాణంలో పనివాడు. ఈ హత్యకు పాల్పడిన ప్రియాతో పాటు ఆమె సోదరుడు హేమంత్, కోడలు ప్రీతిలను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల విచార‌ణ‌లో త‌న‌కు గత నాలుగైదు రోజులుగా తన కలలో నరబలి కోరుతూ దేవత కనిపిస్తోందని ప్రియా చెప్పింది. అందుకే దేవ‌త‌కు బ‌లి ఇచ్చిన‌ట్లు వెల్ల‌డించింది..

- Advertisement -

కాగా, మృతుడి సోదరుడి చెప్పిన వివ‌రాల ప్ర‌కారం .. గుప్తా ప్రియాను తన సోదరిగా పరిగణించే వాడని, బుధవారం తన దుకాణం నుంచి కొన్ని వస్తువులను ఆమె నివాసానికి డెలివరీ చేయడానికి వెళ్లాడని పేర్కొన్నాడు. అయితే, దీని తర్వాత గుప్తా తిరిగిరాకపోవడం, ఫోన్ కాల్‌కి సమాధానం ఇవ్వకపోవడంతో కుటుంబ సభ్యులు అతని కోసం వెతికి పోలీసుకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం నాడు ప్రియ ఇంటి సమీపంలో గుప్తా స్కూటర్ గమనించడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది.

ప్రియా ఇంటి తలుపును తట్టిన సమయంలో ఎలాంటి స్పందన రాలేదని గుప్తా సోదరుడు తెలిపారు. బలవంతంగా తలుపు తెరిచిన సమయంలో ప్రియా, ప్రీతి, హేమంత్‌లు గుప్తా మెడకు స్కార్ఫ్ కట్టి దేవ‌త ముందు బ‌లి ఇచ్చిన‌ స‌న్నివేశం క‌నిపించింద‌ని తెలిపారు. దీంతో పోలీసులు నిందితులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement