Sunday, April 28, 2024

Suryapet: తిరుమలగిరి మార్కెట్ కు రికార్డ్ స్థాయిలో 55వేల బస్తాల ధాన్యం..

సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కు రికార్డు స్థాయిలో ధాన్యం వచ్చి చేరుతుంది. మార్కెట్ కు రైతులు ట్రాక్టర్లతో ధాన్యాన్ని తీసుకువస్తున్నారు. యాసంగి సీజన్ లో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో శనివారం సుమారు 55వేల బస్తాల ధాన్యం వచ్చి, మార్కెట్ ధాన్యపు రాశులతో కళ‌కళ‌లాడుతుంది.

ఒక్కసారిగా ధాన్యాన్ని పెద్ద ఎత్తున తీసుకురావడంతో జనగామ – సూర్యాపేట హైవే పై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. రెండు రోజుల సెలవు అనంతరం వ్యవసాయ మార్కెట్ తెరుచుకోవడంతో రద్దీ పెరిగింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మార్కెట్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement