Sunday, April 28, 2024

TS : మంత్రి పొంగులేటి వాహ‌నాన్ని త‌నిఖీ చేసిన పోలీసులు

లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో పోలీసులు చెక్‌పోస్టుల వ‌ద్ద ముమ్మ‌రంగా త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌తి ఒక్క వాహ‌నాన్ని క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఖమ్మం జిల్లాకు వెళ్తున్న మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి వాహ‌నాన్ని త‌నిఖీ చేశారు.

ఇవాళ తిరుమలాయపాలెం మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన సందర్భంగా మండలానికి వస్తుండగా ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతమైన తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం వద్ద మంత్రి వాహనాన్ని చెక్ పోస్ట్ సిబ్బంది తనిఖీ చేశారు. పోలీసు సిబ్బందికి మంత్రి పొంగులేటి వాహ‌న త‌నిఖీకి స‌హ‌క‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement