Sunday, April 28, 2024

Kerala: కంటైనర్ ను ఢీ కొట్టిన బస్సు.. 11మందికి తీవ్ర‌గాయాలు

కంటైన‌ర్ ను బ‌స్సు ఢీకొన‌డంతో 11మందికి తీవ్ర‌ గాయాలైన ఘ‌ట‌న‌ కేరళ రాష్ట్రం కోజికోడ్‌లో చోటు చేసుకుంది. కేరళ రాష్ట్ర రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌కు చెందిన బస్సు ఇవాళ‌ ప్రమాదానికి గురైంది. చెరువన్నూరు వద్ద జాతీయ రహదారిపై ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. కేఎస్‌ఆర్‌టీసీకి చెందిన బస్సు కొట్టారక్కర నుంచి సుల్తాన్‌ బతేరీకి వెళ్తోంది. ఈ క్రమంలో చెరువన్నూరు హయ్యర్‌ సెకండరీ పాఠశాల సమీపంలోకి రాగానే కంటైనర్‌ లారీని బలంగా ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో సుమారు 11 మంది ప్రయాణికులకు తీవ్ర‌ గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కోయస్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా, ప్రస్తుతం ఆ ప్రాంతంలో మోస్తరు వర్షం కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement