Monday, April 29, 2024

AP : ఐఎఎస్‌ ఆమె టార్గెట్… ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌లో నిర్మ‌ల స‌త్తా…

బాల్య వివాహం నుంచి తప్పించుకుని మరీ తానేంటో నిరూపించుకుంది ఓ బాలిక‌. ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అగ్ర స్థానంలో నిలిచింది. అవకాశం కల్పిస్తే ఆడబిడ్డల సత్తా ఏంటో సమాజానికి చాటి చెప్పింది. అంతేకాదు ఐపీఎస్‌ ఆఫీసర్‌ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలని భావిస్తుండటం విశేషం.

- Advertisement -

వివ‌రాల‌లోకి వెళితే కర్నూలు జిల్లా ఆలూరుకి చెందిన నిర్మ‌ల‌ త‌ల్లిదండ్ర‌లు నిరుపేద‌ల .. ఆమె తల్లిదండ్రులకు నలుగురు కుమార్తెలు, వీరిలో ముగ్గురికి ఇప్పటికే వివాహాలైనాయి. ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి నిర్మలకి కూడా చిన్నతనంలోనే వివాహంచేయాలని భావించారు. ఈ విష‌యాన్ని గ‌త ఆమె జిల్లా అధికారుల‌కు నేరుగానే ఫిర్యాదు చేసింది.

దీంతో ఈ బాలికకు జిల్లా యంత్రాంగం రక్షించి కేజీబీవీలో చేర్పించింది. కానీ చదువుకోవాలన్నపట్టుదలతో పోరాడి బాల్య వివాహంనుంచి తప్పించుకుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పరీక్షలో టాపర్‌గా నిలిచి తానేమిటో నిరూపించుకుంది.
కేజీబీవీలో ఇంటర్‌ ఫస్టియర్ నిర్మల.

బైపీసీలో 440కి 421 మార్కులు సాధించింది. ప్రభుత్వం అండగా నిలవడంతో నిర్మల చక్కగా చదువుకుని అత్యధిక మార్కులు సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌.. నిర్మలను ప్రత్యేకంగా అభినందించారు. ఐపీఎస్‌ అధికారి కావాలనే ఆమె కల సామాజిక న్యాయం, బాల్య వివాహాల నిరోధంపై ఆమెకున్న తిరుగులేని నిబద్ధతను ప్రతిబింబిస్తోందని ప్రశంసించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement