Sunday, April 28, 2024

AP : మ‌ళ్లీ బాల‌కృష్ణ చేతివాటం.. సెల్పీ అంటే చాలు దబిడి దిబిడే ..

స్వర్ణాంధ్ర సాకారం యాత్రలో శనివారం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన ఆవేశాన్ని ప్రదర్శించారు. దబిడి దిబిడిని షురూ చేశారు. తన అభిమాన నటుడితో సెల్ఫీకి యత్నించిన అభిమానికి చుక్కలు చూపించారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం బాలకృష్ణ శనివారం హెలికాప్టర్ లో కదిరికి విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ‌ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు బాలయ్య చేరుకొన్నారు. విషయం తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. జై బాలయ్య జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఓ అభిమాని బాలయ్య దగ్గరకు వెళ్లి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు అభిమాని పై చేయి చేసుకునేందుకు యత్నించారు. పక్కనే బౌన్సర్లు కలుగజేసుకుని బాలయ్య అభిమానిని పక్కకు తోసివేశారు. కాగా, ఇప్పటికే బాలయ్య పలు సందర్భాల్లో తన ఫ్యాన్స్‌పై చేసుకున్నారు.. సింపుల్‌గావచ్చి.. రిక్వెస్ట్‌గా సెల్ఫీ, ఫొటోలు అడిగితే కూల్‌గానే స్పందించే బాలయ్య.. ఎవరైనా తన దగ్గరకు వచ్చి అతిచేస్తే మాత్రం.. వెంటనే సీరియస్‌గా స్పందిస్తారనే విషయం తెలిసిందే.

న‌ర‌సింహ స్వామి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు..

నందమూరి బాలకృష్ణ పట్టణంలోని శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు బాలయ్యకు స్వాగతం ప లికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తదనంతరం కదిరి బైపాస్ లోని తాయి గ్రాండ్ లో విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు మదనపల్లి రోడ్డు లోని పీవీఆర్ ఫంక్షన్ హాల్ లో గిరిజన కమ్యూనిటీ సభ్యులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా జీవి మాను సర్కిల్ లో జరిగే ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తారు. బాలయ్య వెంట కదిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు కృష్ణమోహన్ నాయుడు, డైమండ్ ఇర్ఫాన్ పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement