Saturday, May 4, 2024

National : ఇవాళ్టి నుంచి ఢిల్లీలో భారీ సాహిత్యోత్సవం

ఢిల్లీలో కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఆరు రోజుల పాటు ప్రపంచంలో అతి పెద్ద సాహిత్యోత్సవం నిర్వ‌హించ‌నున్నారు. ఈ విష‌యాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కృత్తివెంటి శ్రీనివాసరావు తెలిపారు. ఇవాళ్టి నుంచి శనివారం వరకు ఈ ఉత్స‌వాలు నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌న్నారు.

- Advertisement -

వంద‌ భారతీయ భాషలకు చెందిన 700 మందికి పైగా రచయితలు, కవులు, పండితులు ఈ సదస్సులో పాల్గొంటారని చెప్పారు. 150 సాహితీ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. సాహిత్యోత్సవాల్లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలూ అందజేయనున్నారు. తెలుగు నుంచి తల్లావజ్ఝల పతంజలి శాస్త్రికి ఈ ఏడాది పురస్కారం లభించిన విషయం తెలిసిందే. కాగా తెలుగు నుంచి కె.శివారెడ్డి, ఇనాక్‌, మృణాళిని, ఈ సాహిత్యోత్సవాల్లో పాల్గొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement