Saturday, May 4, 2024

కాబూల్‌లో భారీ పేలుడు.. 20 మంది మృతి

కాబూల్‌: అఫ్గనిస్తాన్​ రాజధాని కాబుల్‌లో భారీపేలుడు చోటుచేసుకుంది. నగరంలోని ఖైర్‌ ఖానా ప్రాంతంలోని ఓ మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో మసీదు ఇమామ్‌ సహా 20 మంది మరణించారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.

బుధవారం సాయంత్రం మసీదులో ప్రార్ధనలు జరుగుతుండగా, ఒక్కసారిగా భారీ పేలుడు శబ్ధం వినిపించిందని, పేలుడు ధాటికి సమీపంలో ఉన్న భవనాల కిటికీలు ధ్వంసమైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇప్పటివరకు పేలుళ్లకు బాధ్యత వి#హస్తూ ఏ సంస్థా ప్రకటించలేదని వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని కాబూల్‌ పోలీస్‌ అధికార ప్రతినిధి ఖలీద్‌ జద్రాన్‌ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement