ఓషియానియా దేశం అయిన ఫిజీలో భారీ భూకంపం సంభవించింది. ఈరోజు దక్షిణ పసిఫిక్ సముద్రంలోని ద్వీప దేశం అయిన ఫిజీలో భారీ భూకంపం వచ్చింది. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతగా నమోదైందని యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. భూమికి 8 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ఓషియానియా దేశాలు పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో భూకంపాల ఎక్కువగా సంభవిస్తుంటాయి. ఈ భూకంపం రావడంతో ఆ ప్రాంతంలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement