Friday, May 3, 2024

గుజ‌రాత్ లో భారీగా డ్ర‌గ్స్ ప‌ట్టివేత‌

గుజ‌రాత్ లో భాగా డ్ర‌గ్స్ ప‌ట్టుబ‌డింది. ఓఖా పోర్టుకు కొన్ని వంద‌ల నాటిక‌ల్ మైళ్ల దూరంలో ఓ ఇరానియ‌న్ బోటు సంచ‌రిస్తున్న‌ట్లు గుర్తించి.. సోమ‌వారం రాత్రి ఇండియ‌న్ కోస్టు గార్డు, గుజ‌రాత్ ఏటీఎస్ పోలీసులు ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. గుజ‌రాత్ తీరంలో సంచ‌రిస్తున్న ఓ ఇరానియ‌న్ బోటు ను పోలీసులు ప‌ట్టుకుని త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ బోటు నుంచి సుమారు 425 కోట్ల విలువైన 61 కేజీల డ్ర‌గ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నార్కోటిక్స్ స్మ‌గ్లింగ్‌ జ‌రుగుతున్నట్లు వ‌చ్చిన ఇంటెలిజెన్స్ స‌మాచారం మేర‌కు ఈ దాడి చేశామ‌ని యాంటీ టెర్ర‌రిస్టు స్క్వాడ్ పోలీసులు వెల్ల‌డించారు. మొత్తం అయిదు మంది ఇరానియ‌న్ల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ బోటును ఓఖా పోర్టుకు తీసుకువ‌చ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement