Friday, May 10, 2024

శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి ఎంత స‌మ‌యం ప‌డుతుందంటే..!

తిరుమ‌ల‌కు భ‌క్తులు పోటెత్తుతున్నారు. అయితే తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. రోజురోజుకు భ‌క్తుల సంఖ్య పెరుగుతుండ‌డంతో టీటీడీ ఇప్ప‌టికే భ‌క్తుల‌కు ప‌రిమిత సంఖ్య‌లో ల‌డ్డూలు అంద‌జేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారని వారు వివరించారు. నిన్న శ్రీవారిని 78,188 మంది భక్తులు దర్శించుకోగా 35,427 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.94 కోట్లు వచ్చిందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement