Sunday, April 28, 2024

Movie Time | భ‌య‌పెట్ట‌నున్న భ్రమయుగం.. చీక‌టి యుగాల నేప‌థ్యంలో రాబోతున్న మూవీ!

చీక‌టి యుగాల నేప‌థ్యంలో హార‌ర్ జోన‌ర్‌లో కొత్త సినిమా రాబోతోంది. దీనికి భ్ర‌మ‌యుగం అనే టైటిల్ ఖ‌రారు చేశారు. కేర‌ళ‌లోని కొచ్చిచ ఒట్ట‌పాలం ఏరియాల్లో ఈ మూవీని తీసేందుకు లొకేష‌న్స్ కూడా ఎంపిక చేసుకున్నారు. ఇక‌.. ఈ సినిమాని నైట్ షిఫ్ట్ స్టూడియోస్ సంస్థ నిర్మించ‌నుండ‌గా.. మ‌మ్ముట్టి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నారు.

– వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ‌

ప్రత్యేకంగా హారర్ థ్రిల్లర్‌ జానర్‌ చిత్రాలను నిర్మించడానికి నిర్మాత చక్రవర్తి రామచంద్ర స్థాపించిన నైట్‌ షిప్ట్‌ స్టూడియోస్‌ నిర్మాణ సంస్థ ప్రారంభమైంది. తాము నిర్మించబోయే మొదటి సినిమాని ప్రకటించారు. సినిమా పేరు ‘ భ్రమయుగం’, మమ్ముట్టి నటిస్తున్నారు. రాహుల్‌ సదాశివన్‌ రచనద్ఖర్శకత్వం వ‌హిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు మమ్ముట్టి మాట్లాడుతూ.. ఇది ఒక ఉత్తేజకరమైన చిత్రం. నేను ఇప్పటి వరకు చేయని పాత్రను పోషిస్తున్నాను అన్నారు. రచయిత, దర్శకుడు రాహుల్‌ సదాశివన్‌ మాట్లాడుతూ.. ”మమ్ము ట్టి సినిమాకి దర్శకత్వం వహించాలనే కలను సాకారం చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ‘భ్రమయుగం’ అనేది కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో సాగేకథ. ” అన్నా రు.

నిర్మాత చక్రవర్తి రామచంద్ర మాట్లాడుతూ.. ” హారర్‌ జానర్‌పై నాకున్న అభిరుచి, రిచ్‌ కంటెంట్ , ప్రతిభావంతులైన ఫిల్మ్‌మేకర్‌లతో సంవత్సరాల తరబడి పనిచేసిన అనుభవం, ప్రపంచస్థాయి చిత్రాలను రూపొందించాలనే తపనతో ‘నైట్‌ షిప్ట్‌ స్టూడియోస్‌’ని ప్రారంభిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది.” అన్నారు. ‘భ్రమయుగం” చిత్రాన్ని కొచ్చి, ఒట్టపాలంలో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో అర్జున్‌ అశోకన్‌, సిద్ధార్థ్‌ భరతన్‌, అమల్డా లిజ్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నా రు.

Advertisement

తాజా వార్తలు

Advertisement