Tuesday, April 30, 2024

APPSC – ఎపిలో గ్రూప్ 1 తుది ప‌రీక్షా ఫ‌లితాలు విడుద‌ల‌…

అమ‌రావ‌తి – ఎపిలో ఇటీవ‌ల నిర్వ‌హించిన గ్రూప్ 1 ఫైన‌ల్ ప‌రీక్షా ఫ‌లితాల‌ను నేడు విడుద‌ల చేశారు. ఈ ఫ‌లితాల‌ను ఎపిపిఎస్ సి ఛైర్మ‌న్ గౌత‌మ్ స‌వాంగ్ కొద్ది సేప‌టి క్రితం వెల్ల‌డించారు…. మొత్తం 111 పోస్ట్ ల‌కు పరీక్ష‌లు నిర్వ‌హించారు.. ప్రిలిమ్స్, ఫైన‌ల్స్ త‌ర్వాత ఇంట‌ర్యూల‌ను కూడా నిర్వ‌హించారు.. ఇప్పుడు ఎంపికైన అభ్య‌ర్ధుల ఫ‌లితాల‌ను వెల్ల‌డించారు.

గత ఏడాది సెప్టెంబర్ 30 న 111 పోస్టులకి నోటిఫికేషన్ విడుదలకాగా.. జనవరి 8 న ప్రిలిమ్స్ నిర్వహించింది ఏపీపీఎస్సీ. కేవలం 19 రోజులలో అంటే.. జనవరి 27 న ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడించారు. ప్రిలిమ్స్ కి 86 వేల మంది హాజరు కాగా.. 6, 455 మంది మెయిన్స్ కి అర్హత సాధించారు.
జూన్‌ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మెయిన్‌ పరీక్ష నిర్వహించారు. 111 పోస్టులకిగానూ 220 మంది అర్హత సాధించారు. ఇక.. ఆగస్ట్ 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించింది ఏపీపీఎస్సీ. మొత్తం 110 మంది అభ్య‌ర్ధుల జాబితాను విడుద‌ల చేశారు స‌వాంగ్.. ఒక పోస్ట్ స్పోర్ట్స్ కోటా కావ‌డంతో ఆ ఫ‌లితాన్ని త‌ర్వాత విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement