Monday, April 29, 2024

మేడారం అడవుల్లో శవమై తేలిన హోంగార్డు

తాడ్వాయి, ప్రభన్యూస్‌: ములుగు జిల్లా మేడారం జాతర డ్యూటీ- నిమిత్తం వచ్చి తప్పిపోయిన హోంగార్డు శుక్రవారం శవమై కనిపించాడు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌కు చెందిన మైలారం లక్ష్మణ్‌ ఫిబ్రవరి 17న మహాజాతర సందర్భంగా బందోబస్తుకు వచ్చాడు. నాలుగు రోజుల పాటు- డ్యూటీ- చేయగా తిరిగి ఇంటికి వెళ్లలేదు.

ఎన్నిరోజులు వేచి చూసినా ఇంటికి రాకపోవడంతో కుటు-ంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా లక్ష్మణ్‌కు మతిస్తిమితం లేనట్లు- కుటు-ంబసభ్యులు చెప్పారు. అతని కోసం గాలించగా శుక్రవారం మృతదేహం.. ఆయన డ్రెస్‌ ఆధారంగా ఆ వ్యక్తి హోంగార్డు లక్ష్మణ్‌గా పోలీసులు గుర్తించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement