Wednesday, April 24, 2024

ఖ‌మ్మంలో తుమ్మ‌ల అనుచ‌రుల‌ ర‌హ‌స్య భేటీ.. ఏం జ‌రిగింది?

ప్ర‌భ‌న్యూస్‌, ఖమ్మం బ్యూరో: ఖ‌మ్మం జిల్లా పాలేరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ మంత్రి తుమ్మ‌ల అనుచ‌రులు శుక్రవారం ఖమ్మం లో రహస్య సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హైదరాబాద్ లోని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నివాసంలో జరిగిన ఎమ్మెల్యేలు , ముఖ్య నేతల సమావేశం నేపథ్యంలో పాలేరు లో పోటీకి తుమ్మల సిద్ధం అంటూ తుమ్మల అనుచరగణం అంతా ఒక చోట బేటీ అయి సమావేశం నిర్వహించారు. పాలేరు నుండి తుమ్మల ఈసారి పోటీ చేయడం ఖాయమని, పాలేరు నియోజకవర్గంలో తుమ్మల చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని స‌మావేశంలో నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచాంర‌. త్వరలోనే తుమ్మల అభిమానులతో నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం ఖమ్మం రూరల్ మండలంలో నిర్వహించాలని, సత్తా చాటుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. తుమ్మల ఏ నిర్ణయం తీసుకున్నా శిరోధార్యమే నని పలువురు నేతలు పేర్కొన్న‌ట్టు తెలిసింది. ఖమ్మం నగరంలోని జూబ్లీ క్లబ్ లో జరిగిన ఈ సీక్రెట్ సమావేశానికి తుమ్మల నాగేశ్వరరావు దూరంగా ఉండడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement