Saturday, May 18, 2024

హైదరాబాద్ నగరంలో హైటెక్ వ్యభిచారం.. ఏడుగురు యువతుల అరెస్ట్

హైదరాబాద్ నగరంలో గుట్టుచప్పుడు కాకుండా హైటెక్‌ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమాజిగూడ రాజ్‌భవన్ రోడ్డులోని పార్క్‌ హోటల్‌లో హైటెక్‌ వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఏడుగురు యువతులు, ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా అదుపులోకి తీసుకున్న యువతులను పోలీసులు సేఫ్ హోమ్‌కు తరలించారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో ఆదర్శంగా నిలుస్తున్న యువరైతు

Advertisement

తాజా వార్తలు

Advertisement