Wednesday, May 1, 2024

అమెరికాలో తెలుగు మహిళ చరిత్ర. మేరీలాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అరుణా మిల్లర్‌

తెలుగు మహిళ అరుణా మిల్లర్‌ అగ్రరాజ్యంలో చరిత్ర సృష్టించారు. అమెరికాలోని మేరీలాండ్‌ రాష్ట్రానికి లెప్టిnనెంట్‌ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. భారతీయ సంతతికి చెందిన వ్యక్తి అక్కడ లెప్టిnనెంట్‌ గవర్నర్‌ కావడం ఇదే తొలిసారి. అరుణా మిల్లర్‌ వయసు 58 ఏళ్లు. ఆ రాష్ట్రం నుంచి వెస్‌ మూర్‌ డెమోక్రటిక్‌ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. గవర్నర్‌ తర్వాత అత్యున్నత హోదాలో లెప్టినెంట్‌ గవర్నర్‌ ఉంటారు. ఒకవేళ గవర్నర్‌ సరైన రీతిలో విధులు నిర్వర్తించలేని సమయంలో లెప్టిnనెంట్‌ గవర్నర్‌ ఆ బాధ్యతల్ని చూసుకుంటారు. మంగళవారం జరిగిన మధ్యంతర ఎన్నికల అనంతరం అరుణా మిల్లర్‌ విజయాన్ని ఖరారు చేశారు. మేరీలాండ్‌లో అరుణా మిల్లర్‌కు పాపులారిటీ ఎక్కువగా ఉంది.

రిపబ్లికన్‌ మద్దతుదారులు కూడా ఆమెకు సపోర్ట్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు జో బిడెన్‌, ఉపాధ్యక్షురాలు హారిస్‌ కూడా మిల్లర్‌కోసం విస్తృత ప్రచారం నిర్వహించారు. విభజనకు బదులుగా ఐకమత్యాన్ని మేరీలాండ్‌ ఓటర్లు ఎంచుకున్నట్లు విక్టరీ ప్రసంగంలో అరుణా మిల్లర్‌ తెలిపారు. అరుణా మిల్లర్‌ హైదరాబాద్‌లో జన్మించారు. అరుణ ఏడేళ్ల వయసులో ఆమె తల్లిదండ్రులు అమెరికాకు వలస వెళ్లారు. 1972లో అమెరికా వచ్చానని, అప్పటి నుంచి అమెరికా కోసం పనిచేశానని ఈసందర్భంగా అరుణా మిల్లర్‌ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement