Sunday, May 5, 2024

మొగుడిని కొట్టి చంపి ఫ్రిజ్ లో దాచి పెట్టిన ఇల్లాలు…!!

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెహ్మత్ నగర్ డివిజన్ కార్మిక నగర్ లో దారుణ హత్య జరిగిన సంగతి తెలిసిందే. మహమ్మద్ సిద్ధికి అనే వ్యక్తిని అతి దారుణంగా చంపి ఇంటిలో ఉన్న ఫ్రిజ్ లో దాచి పెట్టారు. ఇక సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో సంచలన నిజం ఒకటి బయటపడింది. డెడ్ బాడీ ని ఫ్రిజ్ లో దాచిపెట్టింది ఎవరో కాదట. అతని భార్య నటన రూబీనానేనట.

హంతకురాలు ఆమెనే అని పోలీసులు గుర్తించారు. ఈ ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు రావడంతో రోకలిబండతో భర్త తలపై మోది హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని ఫ్రిజ్ లో దాచి పెట్టి పిల్లలతో సహా పరారైంది. ప్రస్తుతం రుబీనా కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement