Monday, April 29, 2024

హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి కన్నుమూత

హిందూపురం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత తిప్పేస్వామి(80) అనారోగ్యంతో ఆదివారం నాడు కన్నుమూశారు. గత 15 ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో పరిగి మండలంలోని సేవ మందిరంలో ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1978లో తొలిసారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1983 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. 1947లో ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి సొంత స్థలంలో ఏఎం లింగన్న పాఠశాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నారు. తిప్పేస్వామి మృతి విషయం తెలుసుకున్న వెంటనే ఆయన ఇంటికి చేరుకున్న మాజీ మంత్రి రఘువీరారెడ్డి తిప్పేస్వామి భౌతిక కాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement