Sunday, May 19, 2024

తాలిబన్లు చంపినా ఆలయం వదలను: హిందూ పూజారి

ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్లు ఆక్రమించుకున్న నేపథ్యంలో ఆ దేశం విడిచివెళ్లేందకు అక్కడి ప్రజలు ప్రయత్నిస్తుంటే..ఓ హిందూ పూజారి మాత్రం ఆఫ్ఘన్ వదిలి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. పండిట్ రాజేష్ కుమార్ అనే పూజరి ఇక్కడి రత్తన్ నాథ్ ఆలయంలో ఆ కుటుంబం తరతరాలుగా పూజారులుగా పనిచేస్తున్నారట. తన పూర్వీకుల నుంచి వస్తున్న ఈ ఆలయాన్ని వదిలి తాను రావడం జరగదని రాజేష్ కుమార్ స్పష్టం చేశారు. కొంతమంది హిందువులు ఆయన్ను దేశం దాటించి, సాయం చేస్తామని చెప్పినా ఆయన నిరాకరిస్తున్నాడట. ‘‘వందల ఏళ్లుగా మా పూర్వీకులు ఈ ఆలయంలో సేవ చేస్తున్నారు. కొందరు హిందువులు కాబూల్ వదిలి వెళ్లిపొమ్మన్నారు. వేరే చోటకు వెళ్లడానికి, అక్కడ ఉండటానికి సాయం చేస్తామని అన్నారు. కానీ ఈ ఆలయం మా వంశపారంపర్యంగా వస్తోంది. మేం ఇక్కడ వందల ఏళ్లుగా సేవలు చేస్తున్నాం. అలాంటి ఆలయాన్ని నేను వదల్లేను. తాలిబన్లు గనుక నన్ను చంపేస్తే అది కూడా ఆలయానికి నా సేవగానే భావిస్తా’’ అని రాజేష్ బదులిచ్చారట.

ప్రస్తుతం ఈ పూజారి కథను భరద్వాజ్ అనే ట్విట్టర్ యూజర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ కథనంతోపాటు ఆ ఆలయానికి సంబంధించిన పాత వీడియోను కూడా షేర్ చేశారు. ఇతరుల దృష్టి ఆకర్షించకుండా ఉండటం కోసం రత్తన్ నాథ్ ఆలయం ఇల్లులాగే ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం రాజేష్ కుమార్ కథ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి:పాక్ లో మహారాజా రంజిత్ విగ్రహం ధ్వంసం

Advertisement

తాజా వార్తలు

Advertisement