Thursday, May 2, 2024

ఉపాధ్యాయుల బదిలీలపై హైకోర్టు స్టే.. మార్చి 14 వరకు స్టే విధిస్తూ ఆదేశాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ ఉపాధ్యాయుల బదిలీలపై హైకోర్టు స్టే విధించింది. ఉపాధ్యాయుల బదిలీలపై మార్చి 14 వరకు స్టే విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీచర్ల బదిలీల నిబంధనలపై నాన్‌ స్పౌజ్‌ టీచర్ల అసోసియేషన్‌ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. టీచర్ల బదిలీల నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని పిటీషనర్లు వాదించారు. ఉద్యోగ దంపతులు, యూనియన్‌ నేతలకు అదనపు పాయింట్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ జరిపిన హైకోర్టు మార్చి 14 వరకు స్టే విధిస్తూ కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశాలు జారీ చేసింది.

ఇటీవల ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జీవో 317తో బదిలీ అయిన టీచర్లకు కూడా పూర్వ జిల్లా సర్వీసును పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఈనెల 12 నుంచి 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కూడా కల్పించారు. అయితే తాజాగా ఉపాధ్యాయుల బదిలీలపై హైకోర్టు స్టే విధించడంతో బదిలీల ప్రక్రియకు బ్రేక్‌ పడినట్లయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement