Friday, April 26, 2024

Green India Challenge | గ్రీన్​ ఇండియా చాలెంజ్​ అద్భుతం.. పర్వతారోహకురాలు ఆశామాలవ్య

ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో పర్వతారోహకురాలు ఆశా మాలవ్య మొక్కలు నాటారు. మహిళల భద్రత, సమాజానికి సాధికారత కల్పించాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా 25 వేల కిలోమీటర్ల సైకిల్‌ యాత్ర చేపట్టారు ఆశా మాలవ్య. కాగా, ఆమె హైదరాబాద్​ యాత్రలో భాగంగా జూబ్లీహిల్స్ లోని GHMC పార్క్ వద్ద ఇవ్వాల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పర్వతారోహకురాలు ఆశా కోరారు. మహిళల భద్రత, సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హర్షం వ్యక్తం చేశారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. సైకిల్ యాత్రలో భాగంగా హైదరాబాద్ లో ఎంపీ సంతోష్ కుమార్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆశాను ఎంపీ సంతోష్‌కుమార్‌ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement