Thursday, May 9, 2024

Breaking: ఏపీలోని అన్ని రైల్వే స్టేషన్ల‌లో హైఅలర్ట్

తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ లో అగ్నిపథ్‌ వ్యతిరేకంగా యువకులు చేపట్టిన ఆందోళనతో ఏపీలోని అన్ని రైల్వే స్టేష‌న్ల‌లో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. ఈ నేపథ్యంలో విజయవాడ రైల్వేస్టేషన్‌లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఏపీలో పలు రైల్వేస్టేషన్లలో హైఅలెర్ట్‌ ప్రకటించారు. ప్రధాన స్టేషన్లలో రైల్వే పోలీసులు భద్రత పెంచారు. రైల్వే పరిధిలోని ఆర్పీఎఫ్‌, జీఆర్పీ నుంచి అదనపు బలగాలను రప్పించారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లే పలు మార్గాలను పోలీసులు మూసి వేశారు. ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement