Monday, April 29, 2024

క‌రోనా బారిన ప‌డిన – హీరోయిన్ అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్

జలుబు , దగ్గు, జ్వరం లాంటి లక్షణాలతో బాధపడుతున్న హీరోయిన్ అనుపమా ప‌ర‌మేశ్వ‌ర‌న్ టెస్ట్ చేయించుకోగా, కరోనా పాజిటివ్‌గా తేలిందట . దీంతో ప్రస్తుతం ఆమె తన ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండిపోయింది. ఇటీవల విడుదలైన కార్తికేయ 2 సంచలన విజయం సాధించింది. సూపర్‌ హిట్‌గా నిలిచిన కార్తికేయకి సీక్వెల్‌గా రూపొందిన చిత్రమిది. చందూ మొండేటి దర్శకత్వం వహించారు. నిఖిల్‌, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటించారు. అభిషేన్‌ అగర్వాల్‌ నిర్మించారు. ఆగస్ట్ 13న ఈ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. కార్తికేయ 2చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఆమె ఇండియాలోని ప్రధాన నగరాలను చుట్టేసింది. సినిమా విడుదలకు ముందు, విడుదల తర్వాత కూడా ఆమె ప్రమోషన్‌లో పాల్గొని సందడి చేసింది. ఈ క్రమంలోనే ఆమెకి కరోనా సోకి ఉండొచ్చని స‌మాచారం.మరోవైపు అనుపమా పరమేశ్వరన్‌ వరుస సినిమాలతో బిజీగా ఉంది. నిఖిల్‌తోనే18పేజెస్‌సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా వచ్చే నెలలో విడుదల కాబోతుంది. దీంతోపాటు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రంబటర్‌ఫై్‌ చేస్తుంది. అలాగే రెజీనాతో కలిసి మరో బైలింగ్వల్‌ మూవీ చేస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement