Friday, April 26, 2024

ప్రైవేట్ జూ పార్క్ లో స‌ర‌దాగా గ‌డిపిన.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌

ఓ ప్రైవేట్ జూ పార్క్ లో స‌ర‌దాగా గ‌డిపాడు హీరో విజ‌య్ దేవ‌రకొండ‌. త‌న ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌ విహార యాత్రకు వెళ్లారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. తాజాగా తన టూర్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ప్రస్తుతం ఇవి నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కాగా ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌ ట్రిప్ వెళ్లిన విజయ్ దేవరకొండ.. అక్కడి ఫేమస్ పార్క్‌ను సందర్శించారు. సైఫ్ బెల్సాసా అనే వ్యక్తి నిర్వహిస్తున్న ప్రైవేట్ జూ పార్క్‌లో సరదాగా గడిపాడు. ఈ సందర్భంగా అక్కడి జంతవులతో ఆటలాడారు. అక్కడి పక్షులు, కోతులు తదితర చిన్న జంతువులకు ఫుడ్‌ తినిపించారు. ఆ తర్వాత పాములను మెడలో వేసుకున్నారు. అలాగే భారీ సైజు ఫైథాన్లను శరీరంపై పాకించుకున్నారు. బోనులో ఉన్న సింహంతో తాడు ఆట ఆడిన విజయ్.. ఏకంగా పులి పిల్లలను ఒళ్లో ఆడించారు.

అంతేకాదు వాటికి పాలు కూడా పట్టారు. మొత్తానికి పార్క్‌లోని జంతువులు, పక్షులతో తన సమయాన్ని సరదాగా గడిపాడు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్న విజయ్‌ ‘బ్యూటిఫుల్‌ గార్డెన్.. రామచిలుకలు, పక్షులు, విచిత్రమైన జంతువులను చూడటం చాలా హ్యాపీగా ఉందన్నాడు. అంతేకాదే పాములంటే భయపడే తనకు ఆ భయాన్ని పోగొట్టారంటూ జూ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాడు. అలాగే సింహం, పులి పిల్లలతో మాట్లాడటానికి సహాయపడిన జూ సిబ్బంది, క్యూరేటర్స్‌కి స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నానని కామెంట్స్ షేర్ చేశాడు. ‘నా లైఫ్‌లో ఇదో మధుర జ్ఞాపకం’ అని షేర్‌ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.క్రూర జంతువులతో లైగర్‌ బాగానే సమయాన్ని గడిపారంటూ ఫ్యాన్స్‌ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఖుషి, గౌతమ్‌ తిన్ననూరి ప్రాజెక్టు తర్వాత మరో సినిమాకు ఓకే చెప్పాడు విజయ్‌. తనకు ‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పరశురాంతో మరో సినిమా చేయబోతున్నట్లు ఇటీవలే ప్రకటించాడు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement