Tuesday, April 30, 2024

వివాదంలో హీరో – కోర్టుకి హాజ‌రైన రానా

వివాదంలో చిక్కుకున్నాడు హీరో రానా. . ఆయన కుటుంబానికి చెందిన ఓ స్థలాన్ని లీజ్ కి ఇచ్చి.. గడువు ముగియకముందే ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారంటూ ఓ వ్యక్తి కోర్టుని ఆశ్రయించాడు ఓ వ్య‌క్తి . దీంతో రానాకు కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఫిల్మ్ నగర్ లో ప్రాంతంలో ఉన్న 2200 గజాల స్థలాన్ని దగ్గుబాటి కుటుంబం ఓ వ్యక్తికి లీజుకి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది సురేష్ బాబు, వెంకటేష్ పేర్లపై ఉందట. అయితే లీజ్ గడువు ముగియకముందే ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారంటూ సదరు వ్యక్తి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుని ఆశ్రయించినట్లు సమాచారం. అంతేకాదు, ఓ వైపు ఈ వివాదం జరుగుతుండగానే స్థలంలో సగ భాగాన్ని రానా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించినట్లు తెలుస్తోంది. కోర్టు నోటీసుల నేపథ్యంలో తన లాయర్ తో కలిసి తాజాగా రానా కోర్టుకి హాజరైనట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement