Friday, May 17, 2024

Delhi | కవిత పిటీషన్‌పై విచారణ 26కు వాయిదా..

ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ తనను విచారించడంపై సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటీషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు, తదుపరి విచారణను ఈనెల 26కి వాయిదా వేసింది. కవిత దాఖలు చేసిన పిటీషన్‌పై సమాధానం ఇవ్వాలని సీబీఐకి నోటీసులు జారీ చేసింది ప్రత్యేక న్యాయస్థానం. కవితను ప్రశ్నించడంపై రిప్లై దాఖలు చేయడం లేదని సీబీఐ తెలిపింది. సీబీఐ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై కవిత తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. కవితను మళ్లీ ప్రశ్నించాల్సి వస్తే ముందే సమాచారం ఇవ్వాలని జడ్జి ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement