Monday, May 6, 2024

ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్.. చంద్రబాబుకు రాష్ట్రపతి ప్రశంసలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి అడ్మినిస్ట్రేటర్ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కితాబిచ్చారు. సోమవారం టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ కుటుంబ సభ్యులతో రాష్ట్రపతిని న్యూఢిల్లీలోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఆమె కాసేపు ఎంపీతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తుఫానులు సంభవించిన సమయంలో  ఒడిశా రాష్ట్రానికి చంద్రబాబు సహకరించారని, ఆయన అడ్మినిస్ట్రేటర్ అని ద్రౌపది ముర్ము ప్రశంసించారని రవీంద్ర కుమార్ వెల్లడించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement