Saturday, September 21, 2024

20వేలు దాటిన యాక్టివ్‌ కరోనా కేసులు..

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. వరుసగా మూడో రోజూ మూడు వేలకుపైనే కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 59,512 మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా, 3,641 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో దేశంలో కొవిడ్‌ బారిన పడిన వారి సంఖ్య 4.47 కోట్లకు చేరింది. మరోవైపు యాక్టివ్‌ కేసుల సంఖ్య 20 వేల మార్క్‌ను దాటింది.

ప్రస్తుతం 20,219 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు 4.41 కోట్ల మంది (4,41,75,135) కోలుకున్నారు. తాజాగా 11 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 5,30,892కి చేరింది. రికవరీ రేటు 98.76 శాతం, మరణాల రేటు 1.19శాతంగా ఉంది. ఇప్పటి వరకు 220.66 (220,66,12,500) కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement