Wednesday, May 1, 2024

సర్పంచ్ వేధింపులు.. ఆశా వర్కర్ ఆత్మహత్యయత్నం

వరంగల్ జిల్లా ఖానాపూరం మండలం నాజి తండా సర్పంచ్ బాలకిషన్ వేధింపులు భరించలేక ఆశా వర్కర్ గా పని చేస్తున్న కునుసోత్ నీల(35) ఇంటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకున్నారు. బాధిత మహిళ నీలా తెలిపిన వివరాల ప్రకారం… వృత్తిలో భాగంగా పని చేస్తున్న క్రమంలో నాజీ తండా సర్పంచ్ బాలకిషన్ వివిధ రకాల కారణాలతో వేదిస్తున్నట్లు తెలిపారు. గత కొద్ది రోజులుగా వ్యక్తిగతంగా దూషణలు చేస్తూ దాడి చేసే ప్రయత్నం చేసినట్లు ఆమె తెలిపారు. దాడి చేస్తున్న సమయంలో వీడియో తీయగా ఎస్సైతో చెప్పి డిలీట్ చేయించినట్లు వివరించారు. మానసిక ఇబ్బందులు నేపథ్యంలో పురుగుల మందు తాగి నట్లు ఆమె తెలిపారు. ఆరోగ్య పరిస్థితి పై విధుల్లో ఉన్న వైద్యురాలు స్నేహను వివరణ కోరగా ప్రస్తుతం నీలా ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement