Monday, April 29, 2024

వాస‌వి క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి ఆల‌యాన్ని సంద‌ర్శించిన -ప‌వ‌న్ కల్యాణ్

గుంటూరులోని వాస‌వి క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి ఆల‌యాన్ని సంద‌ర్శించారు జ‌న‌సేన అధినేత‌.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్. కాగా పవన్ కు ఆలయ వర్గాలు సంప్రదాయ స్వాగతం పలికాయి. పవన్ వస్తున్నాడని తెలియడంతో అభిమానులు, జనసైనికులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. కన్యకా పరమేశ్వరి ఆలయ పరిసరాల్లో జనస కోలాహలం నెలకొంది. అందరికీ అభివాదం చేస్తూ పవన్ కల్యాణ్ ఆలయంలోకి ప్రవేశించారు. వాసవీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు జనసేనానికి తీర్థప్రసాదాలు, పవిత్ర వస్త్రం అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement