Wednesday, May 1, 2024

సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన ఏడవ రోజుకు చేరింది. మెయిన్ గేటు వద్ద విద్యార్థులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. అయితే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ కు లేఖ రాశారు. బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల సమస్య పరిష్కారానికి మీరు వెళ్లరు.. మేమెళ్తామంటే అరెస్టులు చేస్తున్నారన్నారు. హైదరాబాద్ నుంచి బాసర వరకు అరెస్టులకు పాల్పడుతున్నారు. విద్యార్థుల సమస్యలు సిల్లీ అంటూ మంత్రి హేళన చేశారన్నారు.

సమస్య పరిష్కరిస్తామని కేటీఆర్‌ ట్వీట్‌ చేసి 5 రోజులైనా అతీగతీ లేదన్నారు. 8 ఏళ్లలో ఒక్క ఉన్నత విద్యాసంస్థను తేలేకపోయారన్నారు. లక్షల ఉద్యోగాలకు అవసరమైన అర్హత ఎక్కడి నుంచి వస్తుందని ప్ర‌శ్నించారు. వెంటనే మంత్రులు ట్రిపుల్ ఐటీని సందర్శించాలని, సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని రేవంత్‌రెడ్డి లేఖలో డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement