Tuesday, April 30, 2024

chhattisgarh: తుపాకీ పేలి.. రైల్వే కానిస్టేబుల్ దుర్మరణం

ప్రమాదవశాత్తూ సర్వీసు తుపాకీ పేలి ఓ రైల్వే కానిస్టేబుల్ దుర్మరణం చెందిన ఘ‌ట‌న ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో శనివారం సంభవించింది. ఈ ఘటనలో మరో ప్రయాణికుడు కూడా గాయపడ్డాడు. దినేశ్ చంద్ర (30) అనే కానిస్టేబుల్ ఎస్-2 కోచ్ నుంచి కిందకు దిగుతుండగా తుపాకీ పేలింది.

తూటా నేరుగా అతడి ఛాతిలోకి దూసుకుపోవడంతో అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. సమీపంలోనే పైబెర్తుపై నిద్రిస్తున్న మహ్మద్ డానిష్ అనే ప్రయాణికుడికి కూడా తూటా తగిలి గాయమైంది. బాధితులిద్దరినీ ఆసుపత్రికి తరలించగా కానిస్టేబుల్ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కడుపులో గాయమైన ప్రయాణికుడికి చికిత్స కొనసాగుతోంది. మృతుడిది రాజస్థాన్ అని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement